భీమఖండము లో పార్వతీపరమేశ్వరుల సాక్షాత్కారం

పవిత్ర “మహాశివరాత్రి” పర్వదిన సందర్భంగా ఆ పరమశివుని ప్రసన్నదృక్కులు అందరిపైనా ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ “భీమఖండము” లో ఎంత హృద్యంగా వర్ణించాడో మీ అందరి దృష్టికి తేవాలని అనిపించింది. ముందుగా పద్యాన్ని చిత్తగించండి.   …