రచన : బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి. అదృష్టమంటే జగన్నాథ రాజు గారిదే అదృష్టం! ఏమంటే – ఆయన మొదట ఒక చిన్న గుమాస్తాగా విజయనగర సంస్థానంలో అడుగుపెట్టేడు. చదువు చూస్తే నాలుగో…
చుప్పనాతి – ధారావాహిక – త్వరలో
నాగపద్మిని గారి గురించి: సరస్వతీపుత్ర బిరుదాంకితులు ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారల ముద్దు బిడ్డ డా.పుట్టపర్తి నాగపద్మిని గారు. తల్లిదండ్రులిరువురూ, సంగీత సాహిత్యాలలో సుప్రసిద్ధులు. నాగపద్మిని గారు తల్లిదండ్రులా బాటలో నడుస్తూ, 1978…
గణపతి తత్వం
2016లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్కు నేను వ్రాసిన స్క్రిప్ట్ ఇది వేదాలు, ఉపనిషత్తులనే పునాదులపై సనాతన ధర్మం నిలచివుంది. ఈ గ్రంథాలలో వివిధ దేవతల వివరాలు, వారి ఉపాసనా మార్గాలను వివరించడం జరిగింది. మాండూక్య ఉపనిషత్తు “వైశ్వానర” అన్న భగవద్రూపాన్ని…
ఎవరికీ దొరకని మహా విషాద కావ్యం కిషోర్ కుమార్!
1. హిందీ వెండి తెరపై అల్లరి అంటే కిశోర్ – కిశోర్ అంటే అల్లరి. మహా పిసినారిగా పేరు తెచ్చుకొన్నాడు. అదే పిసినారి కిషొర్ మధుబాల విషయంలో చాలా ఉదారంగా ఉన్నాడు. మరణానికి అతి సమీపంలో మధుబాల ఉందని తెలిసీ ఆమెను…
నీవు లేవు – నీ కవిత ఉంది
ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ శత జయంతి వత్సరం. ఈ సందర్భంగా ఆవకాయ.ఇన్ సమర్పిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపరలోని రెండవ వ్యాసం మొదటి వ్యాసం: అమృతం చవి చూసిన కవి పరిచయ వాక్యాలు: ‘జయంతి తే సుకృతినో రస…
దత్తోదాహరణ కావ్యము – ఆడియో సహితం
మన సాహిత్యంలో ఉదాహరణము అనునది ఒక లఘుకావ్యం. సంబోధనతో కలిపి ఎనిమిది విభక్తులకూ ఎనిమిది వృత్తాలు రచించాలి. ప్రతి వృత్తానికీ కొసరుగా ఒక కళిక, ఒక ఉత్కళిక అను రగడ భేదాలు జతపరచాలి. ఇదీ స్థూలంగా దీని రూపం. ఇది కేవలం దైవస్తుతికోసం అవతరించిన కావ్యభేదం. వృత్తాలైతేనేమి, కళికోత్కళికలైతేనేమి అన్నీ వెరసి పాతిక పద్యాలు. ఇంకా ఏవేవో నియమాలు లాక్షణికులు చెప్పేరు కానీ కవులందరూ పాటించినవి ఇంతమాత్రమే. మన శరీరంలోని ఉన్న జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, తన్మాత్రలు ఐదు. ఇలా మన వేదాంతులు చెప్పినవి కూడుకుంటూ వెళితే పాతిక విలువ ఏమిటో తెలుస్తుంది. ఇవన్నీ మన శరీరంలో మనతోపాటూ ఉన్నవే. అన్నిటినీ భగవదర్పణ చెయ్యడం ఉదాహరణ కావ్యంలోని పరమార్ధం.
ఉడుపి శ్రీకృష్ణ ఆలయం – చరిత్ర – ఇతర విశేషాలు
ఉడుపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణిదేవి నిర్మింపజేసిందనే పురాణ ఐతిహ్యం ఉంది. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్రగర్భంలో చేరింది. ఆ తర్వాత ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది.
సినిమా అంటే ఏమిటి?
ఈ వ్యాసం మొదటగా పొద్దు.నెట్ లో ప్రచురితమయింది. దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా?…
